Tuesday, April 21, 2009

కనులు తెఱచి చూడర ఓ నేస్తం
మరిగి పోతోందిరా మన దేశం

సకల శోభితం- భరత దేశం
సస్యశ్యామల భాగ్యదేశం
పేరు మార్చుకొంటోందిరా
కొత్త రూపు దిద్దుకొంటోందిరా

కులము మతమనే మారణహోమం
మనిషి మనిషికీ తీరని దాహం
మనమంతా భారతీయులం
మనమధ్యన ఎందుకురా బలంబలం

అధిక ధరల పెనుతుఫానుకూ
మానభంగాల అగ్నిజ్వాలకు
తట్టుకోలేకపోతోందిరా
అట్టుడికిపోతోందిరా

రాజకీయ భూకంపానికీ
రక్తపాత సుడిగుండానికీ
నిలువలేక మూల్గుతోందిరా
చావు మునక లేస్తోందిరా

No comments: