Friday, August 21, 2009

దక్షిణ వాహిని గోదావరి -అపర పంపానది
గూడెంకొండయే తెలుగునాట- అభినవ శబరిగిరి
కొలువైఉన్నాడు కొండలరాయుడు-అయ్యప్పా
శరణన్న స్వాముల కరుణించేస్వామి-శ్రీ ధర్మశాస్తా
1. దీక్షలు గైకొని మోక్షము నందండి
మాలను ధరియించి ముక్తిని జెందండి
నిష్ఠను పాటించి కైవల్యమొందండి
స్వామిని దర్శించి సాయుజ్యమొందండి
2. ఇరుముడి తలదాల్చి పరుగున రారండి
మాతాపితరుల ఆశీస్సులందండి
గురుస్వామి దీవెనలు మనసార పొందండి
స్వామి శరణుఘోష నోరార చేయండి
3. ఎరుమేలి వేరేల పేటైతుళ్ళికి
ఎనిమిది మైళ్లు వెళ్లరే ధర్మపురికి
విఘ్నాలు తొలగించ కొలువుడట గణపతిని
దీక్షపరిపూర్తి జేయ చేరుడు గూడెం గిరిని
4. కరదీపికలను వెలిగించండి
హృదయ నివేదన అర్పించండి
ప్రాణ జ్యోతుల హారతులివ్వండి
జ్యోతిస్వరూపుని ఆత్మన దర్శించండి

No comments: