Friday, August 14, 2009

పదుగురు మెచ్చెటి పదములివే
పరమాత్ముని చేర్చెటి పథములివే
గణనాథునికీ ప్రణతులివే
విఘ్నపతికీ వినతులివే-మాహృదయ హారతులివె
1. నవరంధ్రాల కాయమిది- నవవిధ భక్తుల ధ్యేయమిది
నవరాత్రుల సారమిది-నవరసముల కాసారమిది
నిజములు తెలుపర-గజవదనా
నీ పదములె శరణిక-గౌరీ నందన
2. సరిసరి నటనలు సైచగ లేము- నోములు వ్రతములు నోచగ లేము
చంచల మది నిను కాంచగలేము-నీ మహిమల కీర్తించగ లేము
నౌకను నడిపే నావికుడా-చేర్చర తీరం వినాయకుడా

No comments: