Friday, August 7, 2009

ధర్మపురిని దర్శిస్తే యమపురి చేరేదిలేదు 
నరసింహుని అర్చిస్తే మరు జన్మమేలేదు 
మనసారా సేవిద్దాము-
మనమంతా తరియిద్దాము 

1. గోదారి గంగలో తానాలు చేయాలి 
సత్యవతిగుండంలొ సరిగంగలాడాలి 
బ్రహ్మపుష్కరిణి డోలాసంబరాలు చూడాలి 
కర్మబంధాలనొదిలి కైవల్యమందాలి 

2. ముక్కోటి ఏకాదశి వైభవాలు చూడాలి 
ఏకాంత సేవనాటి వేడుకలను గాంచాలి 
కళ్యాణ ఉత్సవాల సందడితిలకించాలి 
నరహరి చరణాల వ్రాలి పరసౌఖ్యమొందాలి 

3. సుందరమందిరాలు నెలకొన్న పుణ్యక్షేత్రం 
వేదమంత్రాలఘోష పరిఢవిల్లు ప్రదేశం 
పురాణాలు హరికథలతొ అలరారు దివ్య ధామం 
సిరి నరహరి కొలువున్నదీ అపరవైకుంఠం

No comments: