Saturday, August 15, 2009

దేవుడు నాయందుంటే బ్రతుకు పూలపానుపు
ఆతని దయ ఉంటే దేనికింక వెఱపు
జగన్నాటకంలో పాత్రధారి నేను
అడుగడుగున నను నడిపే సూత్రధారి తాను
1. అంతా నేననే అహంకారమెందులకు
అంతా నాదనే మమకారమెందులకు
చింతవీడి శ్రీకాంతుని చిత్తములో నిలిపితే
తానంతట తానుగానె సొంతమై పోతాడు
2. పుట్టినపుడు వెంటతెచ్చిన ఆస్తిపాస్తులేవి
గిట్టినపుడు కొనిపోవ అస్తికలూ మిగలవేవి
నట్టనడి జీవితాన లోభత్వమెందుకు
మూడునాళ్ళ ముచ్చటకే మిడిసిపడుట ఎందుకు
3. నౌకనెక్కి భారమంత తనపైన వేస్తెచాలు
ఆవలిదరి తానే అవలీలగ చేర్చుతాడు
ప్రతిఫలమాశించక నీ పని నువు చేస్తె చాలు
ప్రతి క్షణము కనురెప్పగ మనల కాపాడుతాడు

No comments: