Friday, February 2, 2024

 https://youtu.be/Fnhls4efDls?feature=shared


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


చట్టం న్యాయం ధర్మం -మూడు సింహాలుగా/ 

మన జాతీయ చిహ్నం-మన భారత్ అధికార చిహ్నం/

సత్యమేవ జయతే అన్నదే- న్యాయ నినాదం-

మన దేశపు చట్ట విధానం


కళ్ళకు గంతలతో తీర్పిస్తుంది రాగద్వేషాతీత/

నేరస్తుల శిక్షిస్తుంది కఠినంగా న్యాయదేవత


1.తన పర భేదాలను ఎంచిచూడక

బంధుమిత్ర పక్షపాతమే వహించక

తగు సాక్ష్యాధారాలను పరిశీలించి

అంతర్నేత్రంతోనే అవలోకించి


వాదోపవాదాలను పరిగణించి

నిరపరాధి సంక్షేమం సంరక్షించి

న్యాయాన్యాలను త్రాసులో ఉంచి

భారత శిక్షాస్మృతిని అనుసరించి


కళ్ళకు గంతలతో తీర్పిస్తుంది రాగద్వేషాతీత

నేరస్తుల శిక్షిస్తుంది కఠినంగా న్యాయదేవత


2.రాజూ పేదా ధనిక అందరికీ సమ న్యాయం

ఉండబోదు ఏస్థాయిలో రాజకీయ జోక్యం

నేరానికి తగిన శిక్ష అన్నది ఒకటే ధ్యేయం

పరమోన్నత న్యాయాలయమే పౌరదేవాలయం


సామాన్యుడి హక్కుల పరిరక్షణ ఊపిరిగా

రాజ్యాంగ దిశానిర్దేశ పరమ సూచికగా

సర్వ స్వతంత్ర స్వేఛ్ఛా వ్యవస్థకే వేదికగా

న్యాయమే పరమావధిగా-ఆశ్రితజనులకు ఆశాదీపికగా


కళ్ళకు గంతలతో తీర్పిస్తుంది రాగద్వేషాతీత

నేరస్తుల శిక్షిస్తుంది కఠినంగా న్యాయదేవత