రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
నందనవని నీ మానసం -నిన్న ఎంత సుందరం
సుడిగాలి చెలరేగి-నేడు చిందరవందరం
వివిధ వర్ణ విరి శోభితం-నీమది ప్రశాంతమౌ వసంతం
భీభత్సపు వానలు ముంచగ-మోడుబారి ఇపుడో శిశిరం
1.పలుకులు తలపించె నాడు-మెలికలతొ పారే సెలయేళ్ళు
నవ్వుల్ని రువ్వితె చాలు-ఎదలొ దుముకు జలపాతాలు
నీ మౌనమిపుడాయే గాంభీర్య గౌతమి
నీ హృదయమనిపించే అగాధాల జలధి
2.నీ కనులు కురిపించేను పగలైనా వెన్నెలలు
నీ చెలిమి అలరించేను తొలగించ వేదనలు
మూగవోయింది వీణ తీగలే తెగిపోయి
రాగాలు మరిచింది నలుగురిపై గురిపోయి