రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
ఏ దివ్య లోకాలనుండి ఏతెంచినావో ఇలకు
ఏడేడు భువనాలలోనూ సాటిలేనే లేరు నీకు
విరించి సైతం సృజించలేదు నీలా సృష్ట్యాదిగా
తరించిపోతాడు నిను గాంచి ప్రవరాఖ్యుడైనా
1.స్థాణువులౌతారు ఎవరైనా నీవెదురైతే
అనిమేషులౌతారు నీచూపు తమపైన వాలితే
ఇంద్రధనుసే నేలపై దిగినట్టుగా కనికట్టుకాగా
పూలవనమే నడిచొచ్చినట్టుగా ఆకట్టుకోగా
2.ఖంగుతింటారు కవులంతా నిన్ను వర్ణించగా
విస్తుపోతారులే చిత్రకారులైనా నిను దించగా
చతికిలపడతారు శిల్పులు నిను శిల్పీకరించగా
తికమక పడతారు అందగత్తెలే నిన్ననుకరించగా