Monday, January 6, 2020

సూదంటి చూపులే నీ కన్నులగుండా
సూదంటు రాయిలాంటి నవ్వులు పండ
సూత్తేనే గుండాగిపోతోందే నా అడవి మల్లి
బతికినంత సేపునిన్ను సూడనీ మల్లీ మల్లీ

1.నడుములొన కొంగును దోపేస్తూ
వంగతోటలోన వంగి వంకాయలు కోస్తూ
నంగనాచిలాగ నన్ను ఓరకంట చూస్తూ
ఖంగుతినేలా నన్ను కంగారు పెట్టేస్తూ

2.నా తలతిప్పనీదు నీ బంతిపూల కొప్పు
నీ కాలి కడియాలు కూడ సుడులు రేపు
నీ మత్తులొ పడిపోతే ఆగలేను మాపు రేపు
నా మీద మనసు పడగ చేయాలి ఆ వేలుపు

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:యమన్ కళ్యాణి

ఎంతటి వైభోగము ఏమా వైభవము
ముక్కోటి ఏకాదశి దర్శనానుభవము
ధర్మపురీ నరసింహుని దివ్య విగ్రహం
ఉత్తర ద్వారము ద్వారా భవ్య వీక్షణం

1.అపరవైకుంఠమాయే ధర్మపురియె నేడు
 కన్నుల పండువగా భక్త జనసందోహాలు
గోదావరి స్నానాలతొ పునీతులైజనాలు
ఇహపరమై నెరవేరగ యాత్రా ప్రయోజనాలు

2.కన్నులు వేయున్ననూ ఇంద్రునికే తనితీరదు
నాల్కలువేయైననూ శేషుడే పొగడలేడు
మనోనేత్రమొక్కటే అనుభూతిని నోచును
గోవింద నామ ఘోషె భవతిమి కడతేర్చును

బాణీమారదు భావం మారదు
బాట మారదు బావుటా మారదు
గగనవీథికే గర్వకారణం మువ్వన్నెలఝండా
అవని తలాన భారతమాత వెలుగులు నిండ
జైహింద్ జైహింద్ జైహింద్ జైహింద్

1.ఇదే తల్లికి పుట్టాము ఇదే నేలకై బ్రతికేము
ఊపిరి ఆగిపోయేదాక దేశం మాదిగ తలచేము
మేమంతా హిందువులం ముస్లింలం క్రైస్తవులం
మనుముందుగా ప్రతి ఒక్కరం భారతీయులం
వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం

2.దేశం కోసమె మా తనువు దేశం మీదనె మామనసు
దేశరక్షణకు ప్రాణ త్యాగం  ఉగ్గుపాలతోనే తెలుసు
మేమంతా కర్షకులం కార్మికులం సైనికులం
కులాలనే సమూలంగ వెలివేసిన మానవులం
జై జవాన్ జయహో కిసాన్ జై విజ్ఞాన్ జై అనుసంధాన్