Friday, December 2, 2022


https://youtu.be/i_MXwItjoYU?si=bLa1ShkmONN-PwN2

 7)గోదాదేవి ఏడవ పాశురగీతం-స్వేచ్ఛానువాదం

30రోజుల వ్రతం-ముప్పై రాగాలతో గీతా ఆరాధనం


దయచేసి ఇవే రాగాలలో పాడాలని విన్నపము

ఇవి ఆ మురళీ మోహనుడు పలికించిన రాగాలు


రచన:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం: శ్రోతస్విని 


కేశవ మాధవ ముకుంద శౌరి

గీతాలు ప్రియమార కోరి కోరి

ఆలపించెడి మా బృంద నాయకీ

కనకపోతిమి చెలీ నీ ఆచూకి

ఆదమరచి నిదురింతు వేల

శ్రీ వ్రతమాచరించెడి శుభవేళ


1.వేకువ జామాయే వేగిరపడవు

ఊరంత సందడి నీవేల వినవు

నీ నటనలు కడు విడ్డూరమే

నోము నోచుట నెరిగీ నిర్లక్ష్యమే

ఆదమరచి నిదురింతు వేల

అలసిన మిషతో బద్దకమేల


2.క్రౌంచ మిథునపు కీచు రొదలు

గొల్లభామల గాజుల సడులు

పెరుగు చిలికెడి వింత పదరులు

వినరావా రావాల హరి కీర్తనలు

ఆదమరచి నిదురింతు వేల

వేచితిమి నీకై పదపడి రావేల

 

https://youtu.be/I-s34VyWyHo

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


బద్దకించే చిన్నముల్లువి నువ్వు

సుద్దులాడే పెద్దముల్లుని నేను

మన జీవితమే చెలీ గోడ గడియారం

నాకు పయనమెంతో దూరం

నీకు అడుగు కదపడమే భారం


1.సూర్యకాంతి పువ్వులా నీవైపు నాచూపు

చంద్రగోళమల్లె నీ చుట్టు దిరుగుడె పొద్దుమాపు

తుమ్మెదనై చిక్కుబడితి నీ తమ్మికనుల మద్దెన

పట్టొదలక నీ వెంటబడితి ఎంతగ నువు వద్దన్నా


2.గొడుగును నేనై అడుగడుగున తోడుంటా

పదముల నీ పట్టీనై ఘల్ ఘల్లని మ్రోగుతా

సెకనుల ముల్లెక్కించి సుఖములు చూపుతా

కాలమున్నంత కాలం నీ జతగా కడతేరుతా

 

https://youtu.be/x_CuJbKZgWE?si=hYmVHtmesnSbBmXX

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎన్ని కారణాలో అప్సరసవు నీవని  నమ్మడానికి

రూపం సౌందర్యం గాత్రం గాంధర్వం ఉనికే మార్మికం

ఎన్ని అనుభవాలో నిన్నే దేవతగా కొలవడానికి

దివ్యమైన విగ్రహం వరముల అనుగ్రహం ధర్మాగ్రహం

మనసా వచసా శిరసా అందానికి వందనం

దేహం జీవం భావం సర్వం నీకే అంకితం


1.మురిపిస్తావు సొగసులతో

బులిపిస్తావు సోకులతో

అందీ అందక ఎందుకో ఏమారుస్తావు

కలలో మాత్రం ప్రత్యక్షం

కలయిక కేలనో నిర్లక్ష్యం

ఎప్పటికిక దొరుకేనో నిను పొందే మోక్షం


2.పరీక్షించి చూస్తావు నా ఓర్పుని

నిరీక్షింప కురుస్తావు ఓదార్పుని

ప్రాణం పోతుంటే పోస్తావు  అమృతాన్ని

నిలిచేవు నిత్యం నా కలమందు

పూసేవు కాలే నా హృదయానికి మందు

నవ్వుల దివ్వెలునాకై వెలిగిస్తావు అంధకారమందు

 

https://youtu.be/jJNzcRSxryo?si=pqFrEinmRJcPjiGU

(6) గోదాదేవి ఆరవ పాశురగీతం-స్వేచ్ఛానువాదం

30 రోజుల వ్రతం-ముప్పై రాగాలతో గీతా ఆరాధనం


దయచేసి ఇవే రాగాలలో పాడాలని విన్నపము

ఇవి ఆ మురళీ మోహనుడు పలికించిన రాగాలు


రచన:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం:మలయమారుతం


నీల మేఘ శ్యాముడు

లీలా మానుష విగ్రహుడు

గరుడ గమనుడు శేష శయనుడు

కొలువై ఉన్నాడు కోవెల లోన శ్రీ రంగనాథుడు

నిలుపరో చెలులార హృదయములోన రేపవలు

మేలుకొనరో ముదితలార చేయగ మార్గళి సేవలు


1.ఆలకించరో ఆరుబయట పక్షుల కువకువలు

వినరో మందిరమందున శంఖమూదు నాదాలు

మునులూ యోగులు ఒనరించు హరినామ స్మరణలు

భక్తుల ఎలుగెత్తు గోవింద గోవింద స్వన సందడులు

మేలుకొనరో ముదితలార చేయగ మార్గళి సేవలు


2. ఘాతకి పూతన పాలుత్రాగి హతమార్చినాడు

శకటాసురుని పదతాడనతో తుదముట్టించినాడు

మన్నుదిన్న కన్నయ్య మైమలు జనులు మరువరు

బాలకృష్ణుని ఎనలేని లీలలు ఎన్న జాలరెవరు

మేలుకొనరో ముదితలార చేయగ మార్గళి సేవలు