Monday, November 18, 2019

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
రాగం:భీంపలాస్

దోసిటిలో కాసిన్ని నీళ్ళుతెచ్చి
అభిషేకించగా నను నీవు మెచ్చి
మహాలింగ శంభో చూడునన్ను కనువిచ్చి
కనికరించరా ప్రభో నీ అక్కున ననుజేర్చి

1.తిన్నడు చేసినా పున్నెమేమిటో
తిన్నగ కైలాసవాసమొసగినావు
కరినాగులూ మరి సాలెపురుగూ
చేసిరే పూజలని మురిసినావు
ఆపాటిచేయదా నా నోటి పాట
దూర్జటీ నుదుటికంటి జగజ్జెట్టి శరణంటీ

2.లక్ష్మీపతి కమలాక్షుడు దీక్షగా
నిను లక్ష కమలాల అర్చన జేసే
రావణబ్రహ్మ కుక్షినరములతో
రుద్రవీణమ్రోగించి నిను తృప్తిపరచే
మామూలు మానవుణ్ణి నినునమ్ముకున్నవాణ్ణి
మహాదేవ పంచాక్షరి మాత్రం జపియించువాణ్ణి

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ

No comments: