Monday, January 6, 2020


రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:యమన్ కళ్యాణి

ఎంతటి వైభోగము ఏమా వైభవము
ముక్కోటి ఏకాదశి దర్శనానుభవము
ధర్మపురీ నరసింహుని దివ్య విగ్రహం
ఉత్తర ద్వారము ద్వారా భవ్య వీక్షణం

1.అపరవైకుంఠమాయే ధర్మపురియె నేడు
 కన్నుల పండువగా భక్త జనసందోహాలు
గోదావరి స్నానాలతొ పునీతులైజనాలు
ఇహపరమై నెరవేరగ యాత్రా ప్రయోజనాలు

2.కన్నులు వేయున్ననూ ఇంద్రునికే తనితీరదు
నాల్కలువేయైననూ శేషుడే పొగడలేడు
మనోనేత్రమొక్కటే అనుభూతిని నోచును
గోవింద నామ ఘోషె భవతిమి కడతేర్చును

No comments: