Tuesday, April 28, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

నిన్ను నీవు తెలుసుకొనుటె ఆత్మజ్ఞానము
మనిషి దైవమన్నదే పరమ సత్యము
జగద్గురువు ఆదిశంకర ప్రబోధము
తత్వమసి తత్వమే అద్వైతము
శంకర జయంతి నేడు సద్గురునికి వందనాలు
కంచి పరమాచార్యులకు సాష్టాంగ వందనాలు

1.కాలడిలో ఆర్యాంబ గర్భాన ఉదయించి
ఎనిదేళ్ళ ప్రాయంలో సన్యసించి
గోవింద భగవద్పాదుల గురువుగా పొంది
బ్రహ్మ సూత్రాలకు సరళ భాష్యాలు రచియించి
విఖ్యాతి నొందాడు శంకరుడు అద్వైత సిద్ధాతం ప్రవచించి

2.శృంగేరి పూరీ ద్వారకా జ్యోతిర్మఠాలు
నాల్గు చెరగులా స్థాపించాడు అద్వైత పీఠాలు
కనకధారా స్తవమును ఎనలేని దేవతా స్తోత్రాలను
జగతికి అందగా చేసాడు ఆదిశంకరాచార్యులు
అహం బ్రహ్మాస్మి తత్వాన్ని అవగత పరిచాడు

No comments: