Sunday, November 29, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కొమ్ముకాస్తూ కొంత మీడియా

అమ్ముడవుతూ వింత మీడియా

విలువలు విప్పేకుసుకుంది మీడియా

నిగ్గు తేలని వార్త వాగితె అది వాడియా


1.చదువరులే కరువైన తరుణంలో

పేపర్ లెస్సైన ఎన్విరాన్ మెంట్ లో

ఖర్చేమో తక్కువైన అంతర్జాలంలో

కన్ఫ్యూజన్ పెంచుతోంది నెటిజన్లలో


2.పార్టీల జాగ్గీర్లు టీవీ ఛానళ్ళలో

ఆత్మస్తుతి పరనింద నిత్యం ఆనోళ్ళలో

చదివేస్తే ఉన్నమతీ పోయిన చందంగా

సంచలనవార్తలే సమ్మోహనాస్త్రంగా


3.దొరికిన ఏ వేదిక వదలని లీడర్ లా

ఫేక్ లీకు విషయాలకు తామే ప్లీడర్ లా

ఫేస్బుక్ వాట్సప్ గ్రూపుల్లో వైరలయేలా

సమాంతరంగ సాగుతోంది సోషల్మీడియా

No comments: