రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
రాగం: హంసానంది
నా గార్వమంతా నీదగ్గరే
నా అల్గుడంతా నీ ముందరే
తల్లివి నీవుకాక పరులెలా భరిస్తారు
అమ్మవు నువ్వు కాక అక్కునెవరు జేర్చెదరు
జగదంబా శాంభవీ కైమోడ్పులివె గొనవే
నా ఏడ్పులు నిట్టూర్పులు ఇకనైనా మాన్పవే
1.కడుపే నింపెదవో నా ఆకలి చంపెదవో
బ్రతుకంతా పస్తులుంచి నను పరికించెదవో
అడిగినదిచ్చెదవో ఆశలు త్రుంచెదవో
అప్పచ్చులేవో చూపి సముదాయించెదవో
జగదంబా శాంభవీ కైమోడ్పులివె గొనవే
నా ఏడ్పులు నిట్టూర్పులు ఇకనైనా మాన్పవే
2.సుధనే పోసెదవో వ్యధనే తీర్చెదవో
మదిలో నిండుకున్న గుబులే ఆర్పెదవో
శిఖరము చేర్చెదవో ఫకరే నరికెదవో
పరమ పదము నందించి నందింప జేసెదవో
జగదంబా శాంభవీ కైమోడ్పులివె గొనవే
నా ఏడ్పులు నిట్టూర్పులు ఇకనైనా మాన్పవే
No comments:
Post a Comment