Sunday, October 16, 2022

 రచన ,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:మాండు


ఒకే గూటి పక్షులం ఒకే పదాక్షరాలం

ఒకే పాటలోని భావ రాగ తాళాలం

మనదైన వేదికలో మనసువిప్పు నేస్తాలం

గాన ధ్యానులం గీతాభిమానులం

సరస్వతీ మాత భక్తులం కవితానురక్తులం


1.దాగిన ప్రతిభను గుర్తిస్తాం

సాగని గళాలను సవరిస్తాం

పసందైన వీనుల విందారగిస్తాం

స్పందించే హృదయాలకు వందన మర్పిస్తాం

పాటే ప్రాణంగా బ్రతికేస్తాం


2.శ్రుతి లయలను ప్రతిష్ఠిస్తాం

గతులు జతులను ప్రదర్శిస్తాం

గమకాలను రమ్యంగా పలికిస్తాం

అనుభూతి చెందుతూ ఆనందంగా పాడుతాం

తరించి శ్రోతల తరింపజేస్తాం

No comments: