Monday, December 5, 2022

 

https://youtu.be/w1PY17zB4Ik?si=4V1Q5aK-Uax0y7xN

10) గోదాదేవి పదవ పాశురగీతం-స్వేచ్ఛానువాదం

30 రోజుల వ్రతం-ముప్పై రాగాలతో గీతా ఆరాధనం


దయచేసి ఇవే రాగాలలో పాడాలని విన్నపము

ఇవి ఆ మురళీ మోహనుడు పలికించిన రాగాలు


రచన:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం: భాగీశ్వరి


తలుపు తీయవే నెరజాణా ప్రియ గోపచానా

గోపాలుని తీయని తలపుల మునిగినదానా

అహరహము నిదురనూ హరి నొదలనిదానా

వేకువజామాయే వేగలేవగ జాగేల ఇభయాన


వనమాలినేగొలుచు వ్రతమాచరించగ లెగవా

ఈ గాఢ నిద్దుర నికనైన వీడి సిద్ధపడవే మగువా


1.కుంభకర్ణుణి భగినివో కన్మోడ్పునకు

ఓర్మిగల ఊర్మిళ పూర్వజవో శయనానికి

బదులైన పలుకవే మా అరుపుల గోలకు

పదపడి వీడవే మొద్దునిద్దుర శౌరి సేవకు


2.జాగృతమైనా అనృతమాడకు నిదురయని

తప్పించుకోకు తప్పునోయని తీయక తలుపులని

కొలిచెదము ప్రీతిగ తులసీదళమాలి నారాయణుని

పొందగ వ్రతఫలము అంగజ జనకుని అండను కోరి

No comments: