https://youtu.be/Je51IlNev8I?si=rk8aJpJwDAiKA1ర
రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ
రాగం : ఖరహరప్రియ
ఇందరు ఎందుకు ఆరాధింతురు నిను
ఇందిరా పతీ సుందరానన మా మోరనూ విను
వందనాలు నీకివే కంజాదళాయతాక్షా మము దయగను
గోవిందా వేంకటగిరి నిలయా సరసిజనాభా సహృదయా
నీ పదముల నొదలను
1.నిను నమ్మిన కరుణింతువని అందురు కొందరు
ముందుగానే కాచితివా ఎందుకు అందరు తలవకుందురు
విత్తుముందు చెట్టుముందు తర్కమెందుకందురు
నిను కొలిచి ఇలలోన బావుకున్న భక్తులెందరు
2.బ్రతుకంతా బాధలతో సతమత మవుతుందురు
దిక్కుమొక్కు లేక నిన్ను శరణు వేడుచుందురు
నీవంటూ ఉన్నావంటే మహిమ చూపుమందురు
వేడగనే వేగిరమే వేదాత్మా నిను వెతలు తీర్చమందురు
No comments:
Post a Comment