https://youtu.be/x6hkrdAFdqs?si=-4wLZ1XlvfShARPx
రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)
రాగం: కానడ
మరపురాని చిరునవ్వువు
మాటల మల్లెపువ్వువు
మైత్రికి ఇలలో మరో పేరువు
మా మాడిశెట్టి గోపాల్ నువ్వు
1.ఉద్యోగం కొనసాగింది జీవితభీమాగా
వేదికపై నీ వ్యాఖ్యనం ఎంతో ధీమాగా
ప్రతివారికి నీ పలకరింపు మనసారా ప్రేమగా
నీ కవనం దవనమై నెత్తావిని చిమ్ముగా
బహుముఖ ప్రజ్ఞాశాలివీ మహా వినయశీలివి
2.పలు సాహితీ సంస్థల నిర్వహించి
సాటి కళాకారులెందరినో ఆదరించి
దేశ విదేశీ పురస్కారాలెన్నో గ్రహించి
అనంతచార్య తో కరినగరం బ్రదర్స్ గా భాసించి
కీర్తి గొన్నావు వాఙ్మయసేవనే శిరసా వహించి
No comments:
Post a Comment