Thursday, July 30, 2009

ఎవరికెంత ప్రాప్తమో ఎవరు చెప్పగలరు స్వామి
చేసుకున్నవారికి పుణ్యం చేసుకున్నంత స్వామి
నోరారా పిలిచితె పలుకడా మణికంఠుడు
దోసిలొగ్గి అడిగితే వరమీయడ అయ్యప్పా
1. తులసిదళంతోనే స్వామిని తూచింది రుక్మిణి
ఎంగిలి పళ్ళతోనె స్వామిని మెప్పించెనుగా శబరి
పిడికెడు అటుకులకే స్వామి వశమాయెను కుచేలునికి
ఒక్క మెతుకు తోనే స్వామి కడుపు నింపె ద్రౌపది
2. జోలెనింపే స్వామికి కానుకలను వేయతరమా
సర్వాంతర్యామి స్వామికి శరణుఘోషనే ప్రియమా
కొండంత అయ్యప్పకు గోరంత దీపం పెట్టి
వరములిచ్చే స్వామికి కరములు జోడించగలం
3. ఆత్మస్థైర్యము నాకు అందించవయ్య స్వామి
దేహబలము నాలోన పెంచవేమయ్య స్వామి
ఓపికా ఒద్దికా నేర్పించవయ్యా స్వామి
పరోపకారబుద్ది ప్రసాదించవయ్య స్వామి

No comments: