Saturday, August 10, 2019

త్రివర్ణ పతాక మెగిరింది
నీలి నింగిలో మెరిసింది
భారతీయతను జగతికి చాటగ
స్వేఛ్ఛగ రెపరెపలాడింది
వందే మాతరం వందేమాతరం

కృష్ణార్జునులే రథిసారథులుగ
భగవద్గీతను బోధించింది
సకల మతములకు సమత్వమిచ్చి
లౌకిక బాటన నడిచింది
స్వతంత్ర యోధుల బలిదానాలకి
ప్రతీకగా వెలుగొందింది
వందే మాతరం వందేమాతరం

రైతును రాజుగ మార్చే వరకు
కంకణబద్ధురాలయ్యింది
బడుగుల బ్రతుకులు బాగు పర్చగా
చిత్తశుద్ధితో మెలిగింది
ప్రజాక్షేమమే పరమార్థమ్మని
త్రికరణముల నెరనమ్మింది
వందే మాతరం వందేమాతరం

దేశదేశములకాదర్శముగా
విదేశాంగమే నెరపింది
దురాక్రమణల ఇరుగుపొరుగుల
గుణపాఠాలే నేర్పింది
జనగణమన అధినాయక గీతం
లోకమంతటికి మేల్కొపైంది
వందే మాతరం వందేమాతరం


No comments: