Tuesday, October 27, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఏమాశించావయ్య ప్రభూ ఈ మానవ సృష్టి చేసి

సాధించినదేమయ్యా ఈ అల్ప మనుజులనుండి

పునరపి జననం పునరపి మరణం

బ్రతుకంతా క్షణక్షణం మనుగడకోసం రణం


1.జిట్టెడు పొట్టను ఇచ్చి పట్టెడె పట్టగ చేసి

పడరాని పాట్లనే పడగజేయడం న్యాయమా

తక్కువైతే నీరసం ఎక్కువైతే ఆయాసం

 ఆకలీ అన్నమే ప్రాధాన్యం చేయగ భావ్యమా


2.జిహ్వచాపల్యం మనిషికి  మరొక ఉత్పాతం

మద్యసేవనం ధూమపానము పరమ దరిద్రం

మాదకద్రవ్యాలకై బానిసలవడం దారుణం

మానవత్వం మృగ్యమై పైశాచికతత్వం నీచం

No comments: