రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
ఏమని రాయను నా కవిత
దుఃఖం గడ్డకట్టిన వెత
చేజారినే చెలిమి జత
అశ్రువులే సిరాగ మారిన కత
1.ఏడంటే ఏడే అడుగుల పయనం
మూడంటే మూన్నాళ్ళైన జీవనం
సుడి గాలి చెలరేగి చెదిరిపోయింది
వడగళ్ళ వానలోనా కమిలిపోయింది
2.చిన్నారి గూడు ఛిద్రమై పోయింది
అందాల లోగిలి వన్నె కోల్పోయింది
జంట పక్షి ఎక్కడికో ఎగిరిపోయింది
ఒంటరి తల్లేమో పిల్లల పొదివి పట్టుకుంది
No comments:
Post a Comment