Friday, August 6, 2021

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


స్పందించని ప్రతి గుండె పాషాణం

పులకించని దేహం ఎముకల భోషాణం

మనసంటూ ఉండాలి నవనీతమైతేనే

మనిషంటూ మనగలిగితే మదిలోనూ మాటలోనూ తేనే


1.చిగురాకు పరవశించదా చిరుగాలి స్పర్శకు

చినుకు పలకరించదా నేలతల్లి ఎదురుచూపుకు

మునగదీసుకోవాలా పట్టువిడుపులే లేక

మూతిముడుచుకోవాలా చిరునవ్వైన రువ్వక


2. కడలి నదిని కౌగిలించదా అలల చేతులు సాచి

వేకువ వెలుతురుకూతమీయదా రవిని రమ్మని పిలిచి

ప్రేమగా మీటలేరా ఎదుటివారి హృదయవీణను

ఒడుపుగా నాటలేరా కరడు ఎదలలొ కాస్త కరుణను

No comments: