https://youtu.be/J8IM45xiXRM
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
రాగం :బిలహరి
కలియుగ వైకుంఠమై ధరలొ వరలె తిరుమల తిరుపతి
సుస్థిరముగ సిరియుతముగ శ్రీహరి నిలువగా
సద్గురునాథుడై వెలిసే సాయిగా భువిని కైలాసపతి
పరమేశ్వరుడిల షిరిడీ పురములొ సిద్ధావధూతగా
1.అంగమందు అంబరాల సంబరమే కనరాదు
నివాసమనగరాని వసతే శిథిలమైన మసీదు
భిక్షాపాత్రతొ ఇల్లిల్లు దిరుగ ఆదిభిక్షువనకపోదు
చితాభస్మధారుడిలా మనకు పంచేటిది ఒట్టి ఊదు
2.భోళాతనముతో బాలకులతొ ఆటలాడు
కోపోద్రిక్తతతో దోషములను తూలనాడు
వైద్యనాథుడై ప్రబలిన వ్యాధుల ఆకీడు
పరవశమున చిందులేసి తకిటతధిమి నాట్యమాడు
No comments:
Post a Comment