రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
మేలుకొలుపగలము నిదురించిన వారిని
జాగృత పరుచలేము నిద్రనటించే వారిని
ఎంత వాస్తవమైంది నేస్తం ఈ నానుడి
అక్షర సత్యమనిపిస్తుంది మదికెదురుపడి
1.బిగించుకొని ఉంటే పెదాలు పలికించలేము
మూగనోము పాటిస్తే శబ్దాలు నినదించలేము
తీసకెళ్ళగలిగేము గుర్రాన్ని ఏటి నీటిలో వరకే
తాగనుపో పొమ్మంటే కళ్ళప్పగించాలి ఊరకే
2.శిలా ప్రతిమలుంటాయి ఉలుకుపలుకు లేక
ఆరోవేలన్నది ఆ దైవపు అప్రయోజన కానుక
సార్థకతే చేకూరాలి మనమంటూ ఉన్నాము కనుక
ఉన్నమాటంటే ఎందుకు ఎవరికైనా సరే కినుక
No comments:
Post a Comment