Tuesday, November 29, 2022

 

https://youtu.be/Eb0iUQAqhuA?si=iRV0CNzlt5mL61xL

(3)గోదాదేవి మూడవ పాశురగీతం-స్వేచ్ఛానువాదం

30రోజుల వ్రతం-ముప్పై రాగాలతో గీతా ఆరాధన


దయచేసి ఇవే రాగాలలో పాడాలని విన్నపము

ఇవి ఆ మురళీ మోహనుడు పలికించిన రాగాలు


రచన:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం:మాయా మాళవగౌళ


మూడడుగులు బలిని దానమడిగినవాడు

చూడముచ్చటైన మన వామన బాలుడు

ఏడేడు లోకాల నాక్రమించి వ్యాపించినాడు

జగన్నాటక సూత్రధారి విరాట్రూపి త్రివిక్రముడు

విశ్వశ్రేయస్సు కూర్చాలి శ్రీకాంతుడు అనంతుడు


1.మార్గళి స్నానమాచరించు వ్రత ఫలమున

మూడు వానలు ఆరు పంటల సమృద్ధిగా

ఇంటింటా గోకులాన కురియనీ వాన సంపదగా

భారమైన గోపొదుగుల కారాలి పాలుధారగా

జగన్నాటక సూత్రధారి విరాట్రూపి త్రివిక్రముడు

విశ్వశ్రేయస్సు కూర్చాలి శ్రీకాంతుడు అనంతుడు


2.పచ్చదనము తో ప్రకృతి కనువిందు చేయగా

జుమ్మను తుమ్మెదలే కలువల ఎదల వాలగా

పెరిగిన పైరుల ధాన్యము అపారమై గాదెలు నిండగా

రెపల్లే బృందావనాల కావాలి అనునిత్యం పండగా

జగన్నాటక సూత్రధారి విరాట్రూపి త్రివిక్రముడు

విశ్వశ్రేయస్సు కూర్చాలి శ్రీకాంతుడు అనంతుడు

No comments: