Thursday, December 1, 2022

 

https://youtu.be/gDq1sD3uGdM?si=uFlWh-S0wmcuSoZ6

4)గోదాదేవి నాలుగవ పాశురగీతం-స్వేచ్ఛానువాదం

30రోజుల వ్రతం-ముప్పై రాగాలతో గీతా ఆరాధన


దయచేసి ఇవే రాగాలలో పాడాలని విన్నపము

ఇవి ఆ మురళీ మోహనుడు పలికించిన రాగాలు


రచన:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం:మధ్యమావతి



పారణదేవా కరుణజూపుమా

అనుకూలముగా కురియుమా

ఘనాఘన సుందర దేహుడు

దయా సముద్రుడు మా కృష్ణుడు

నీ ప్రతి కదలిక తానైనవాడు

సర్వజగత్కారణ భూతుడు,తులసీదళ సంప్రీతుడు


1.మహాసాగర నడుమన కేగి

అపార జలమును  కడుపార త్రాగి

గర్జించు  పర్జన్యవై నిండాలి నింగి

వర్షించు శార్ ఙ్గ ధనుర్భాణ భంగి

స్ఫురణకు రావాలి నారాయణుడు

శరణము నీయాలి శ్రీరంగనాథుడు


2.అతివృష్టికానీకు అనావృష్టిరానీకు

దాతృత్వములో సాటి రారెవరు నీకు

నీ వాన మేలవని  భూలోక జనులకు

మార్గళి స్నానమై వరలనీ మా మేనులకు

సన్నుతులివె మా స్వామి రంగరంగనికి

సాష్టాంగ ప్రణతులివె మా నరసింగునికి

No comments: