Monday, December 12, 2022

 

https://youtu.be/uFPlWTxTDeE?si=26D-47FgY53xp0ah

16) గోదాదేవి పదహారవ పాశురగీతం-స్వేచ్ఛానువాదం

30 రోజుల వ్రతం-ముప్పై రాగాలతో గీతా ఆరాధనం

దయచేసి ఇవే రాగాలలో పాడాలని విన్నపము

ఇవి ఆ మురళీ మోహనుడు పలికించిన రాగాలు


రచన:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం: ధర్మవతి


నీదెంతటి భాగ్యమో  కక్షావేక్షకా

నందగోప  మందిర సంరక్షకా

సుందర కుడ్యాలు చెక్కణాల సౌధ ద్వారపాలకా

సుప్రభాత సేవకై స్వామి మేలుకొలుపు మా వేడుక

వేడుచుంటిమి దారివిడువు ఏ మాత్రం మమ్మాపక


1.శ్రీవ్రత దీక్షాదక్షులము మేము ముముక్షులము

యదు ముదితలము గోవిందుని కొలిచే బేలలము

నీలమణుల రుచిర దేహుడు కృష్ణుడంపె ఆహ్వానము

మురళీధరుడే వరమీయగ బాస చేసె నిన్నటి దినము


2.నీలమేఘశ్యాముని ఈవేళ నిద్రలేపుదామని

వనితలమంత గూడి తిరుప్పావై వ్రతాచరణకని

శుభోదయాన ఈ శుభసమయాన గానము చేయబూని

వచ్చితిమిటకు వారించకు మము తలుపులు తెరువగ మాని

No comments: