Monday, December 12, 2022

https://youtu.be/ghffvMxFri8?si=wh9YMoxFwbcBbEup


 17) గోదాదేవి పదిహేడవ పాశురగీతం-స్వేచ్ఛానువాదం

30 రోజుల వ్రతం-ముప్పై రాగాలతో గీతా ఆరాధనం

దయచేసి ఇవే రాగాలలో పాడాలని విన్నపము

ఇవి ఆ మురళీ మోహనుడు పలికించిన రాగాలు


రచన:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం:భీంపలాస్(అభేరి)


తిరుప్పావై వ్రతమొనర్చు తరుణులము

వ్రతఫలితము మాకొసగగ మీరే శరణము

గోపకుల గోపాలకుల ఏలికా

నందగోప స్వామీ మేలుకోఇక

ఏలోటు రానీయక మమ్మేలే మారాజా

మాకు మేలుకూర్చగా మేలుకో రవితేజా


1.అన్నపానాదులకు ఉన్ని వస్త్రాదులకు

కొదవలేని విధముగా మము కాచే నేతకు

యదుకుల మానినీ యశోదా భామామణీ

దంపతులిరువురు  మేలుకూర్పరో మేల్కొని


2.త్రివిక్రముడిగా మూడడుగులతో ఈ జగతిని

ఆక్రమించిన శ్రీకృష్ణ పరమాత్మా వదులు నిద్రని

రత్నకంకణధరా బలరామా విని మా మనవిని

మేలొనర్పు మాకు తమ్మునితో సహా మేల్కొని

No comments: