Sunday, December 4, 2022


https://youtu.be/K-n7dHTb9R4?si=16oUnmK0QuqZvKQx

 9) గోదాదేవి తొమ్మిదవ పాశురగీతం-స్వేచ్ఛానువాదం

30 రోజుల వ్రతం-ముప్పై రాగాలతో గీతా ఆరాధనం


దయచేసి ఇవే రాగాలలో పాడాలని విన్నపము

ఇవి ఆ మురళీ మోహనుడు పలికించిన రాగాలు


రచన:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం: వలజి


అత్తకూతురా మేనత్తకూతురా

వగలమారి వన్నెలున్న వదినమ్మా

మత్తు నిదుర వదలవే ముదురమ్మా

భక్తపరాయణుడా నారాయణుని కొలువగ వేళాయెనే

దిండును హత్తుకుని పండుకొన్నదిక చాలు మేలుకొనవదేలనే


1అత్తరు పరిమాళాలు చిత్తము చిత్తుచేయగా

సుతిమెత్తని పరుపుమీద వత్తిగిలినావా

రతిసుఖసారుని మతిలో నిలిపి కమ్మని కలకంటివో

ఇరుకైన వాడలో అద్దాల మేడలో ఇభవరదుని బిగికౌగిటి కలకంఠివో

భక్తపరాయణుడా నారాయణుని కొలువగ వేళాయెనే

దిండును హత్తుకుని పండుకొన్నదిక చాలు మేలుకొనవదేలనే


2.మమతలు పంచేటి మా ప్రియమైన అత్తమ్మా

నీ గారాల సింగారాల కూతురిని కుదిపైనా లేపవమ్మా

చెవిటిదీ మూగదీ కానైతె కాదుగాని కదలదేలనమ్మా

కన్నయ్య లీలలెన్నొ గానం చేసే మా అలికిడికి ఉలకదు పలకదేలనమ్మా

భక్తపరాయణుడా నారాయణుని కొలువగ వేళాయెనే

వ్రతదీక్ష కొనసాగ వదలము వదినను తప్పదు తననికా మేలుకొలుపవమ్మా

No comments: