Sunday, December 4, 2022

 https://youtu.be/DYyZvGUI7O0?feature=shared


8) గోదాదేవి ఎనిమిదవ పాశురగీతం-స్వేచ్ఛానువాదం

30 రోజుల వ్రతం-ముప్పై రాగాలతో గీతా ఆరాధనం


దయచేసి ఇవే రాగాలలో పాడాలని విన్నపము

ఇవి ఆ మురళీ మోహనుడు పలికించిన రాగాలు


రచన:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం: దేశ్


ఓ గోపికా నువు నిదురించుట నాపిక

నిను మేలుకొలుపగ సన్నగిల్లె మా ఓపిక

శ్రీకృష్ణుని సేవలో నీకు ఆసక్తి మెండు కనుక

నిను తోడ్కొని పోవగ తప్పదు మాకీ జాగృత గీతిక

శ్రీ రంగశాయి కీయగా మనము మంగళహారతిక


1.పొద్దెక్కి పోతోంది సద్దు పెద్దదవుతోంది

ఆలమందయూ పచ్చిక బయలుకు చేరింది

మంచు ఆవరించిన పచ్చికను మేయసాగింది

నీదే ఇక ఆలిసెము మనబృందమంత సిధ్ధమైంది

శ్రీ వ్రతమాచరించ నిను శీఘ్ర పరచుతోంది


2.చాణూర ముష్టికుల మట్టి కరిపించిన వాడు

వైకుంఠధాముడైన మహావిష్ణు అవతారుడు

గానవిలోలుడా గోపాలుని ప్రణుతించినంతనే

ఇహపర సౌఖ్యమొసగి మనల ఆదరించుతాడు

వెంటనే కనులు విప్పి మా వెంటను చని తీరాలిక

No comments: