https://youtu.be/i2qCWqTWx7k
రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ
రాగం:శంకరాభరణం
వాగధీశ్వరీ అమ్మా బాసర జ్ఞాన సరస్వతీ
శ్రీ చక్రనగర సింహాసనేశ్వరీ మాతా భారతీ
వ్యాస ప్రతిష్ఠిత వేదాగ్రణీ వాణీ నమస్కృతి
నా ధ్యాసవు శ్వాసవు నీవే పారాయణీ శరణాగతీ
1.విద్యయు వివేకము విచక్షణా నీ వరమే
ఆలాపన ప్రేలాపన ఆలోచన అన్నీ నీ చలవే
సుభాషితాలు మాత్రమే వాక్కున దయచేయవే
అనురాగ రాగాలే ఇలలో వెలయింపజేయవే
2.బుద్దిని మనసును చిత్తమును శుద్ధిచేయవే
అహంకారమంతటినీ అణచి పారవేయవే
ఉచితా నుచిత వివేచన మదిలో వికసించనీవే
మాలో నీ నిజరూపునీ దేవీ ప్రకటింప జేయవే
No comments:
Post a Comment