Sunday, August 11, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

మూడు ప్రాంతాలలో కడువింతగా
వెలిసావు స్వామి శయన మూర్తిగా
శ్రీరంగ పట్టణాన ఆదిరంగస్వామిగా
తిరువనంతపురాన అనంత పద్మనాభునిగా
శ్రీరంగం పురమున రంగనాథ స్వామిగా
ఏకాదశి వ్రతమును నీమముతో పాటించగా
భక్తులనుద్ధరించి భవజలధిని దాటించగా

1.శ్రీ వైష్ణవ సాంప్రదాయమునకాలవాలమై
విశిష్టాద్వైత సిద్ధాంతమునకు మూలమై
వైజయంతిమాలతో అలంకారశోభితమై
తిరునామాలతో చిద్విలాస వదనుడవై
కొలువైనావు రంగశాయి సిరి పాదములొత్తగా
సేదదీరుతున్నావు స్వామీ కాసింత మత్తుగా

2.మార్గళివ్రతమునాచరించె గోదాదేవి
తిరుప్పావైని రచించె పాశురాల పద్ధతిని
మును ముందుగ తులసిమాల తానే ధరించి
పెరుమాళ్ళస్వామినీకు  సమర్పించె ఆండాళ్ళు
చేకొంటివి పత్నిగా ఆముక్త మాల్యదని
ధనుర్మాసమందున మా కనులవిందుగా

No comments: