Tuesday, August 6, 2019


కసాయి కఱకు పాలన
కబంధ హస్తాల్లొ తెలంగాణా
నైజాము రజాకార్ల జమాన
కళ్ళముందు కదులుతున్న భావన

1. ఏ రాజ్యాంగంలోనిదీ అధికరణ
ప్రజలమనోభావాల ధిక్కరణ
“ ప్రజలకొఱకు ప్రజలచే ప్రజలు ” అనే
మరిచారా ప్రజాస్వామ్య వివరణ

2. దిక్కులేనివయ్యాయి ప్రాథమిక హక్కులు
నడకసాగనీయకుండ ఎన్నెన్ని చిక్కులు
శాంతి స్వేఛ్చలకే కడితే సమాధులు
నిరంకుశత్వానికి ఉండవుగా పుట్టగతులు

3. తిరుగుబాట్లు కావుకదా ఈఉద్యమాలు
ప్రజాకాంక్ష తెలుపుకొనుటకీ సాధనాలు
గదిలొపెట్టినోరుకట్టి కొట్టె ఈ వైనాలు
పులిగమారి పిల్లైనా తీయదా ప్రాణాలు

No comments: