Tuesday, August 11, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:హంసానంది

వాసి చూసి స్పందించే హృదయాలెన్ని
సాహితీ విలువలనెరిగి నందించే ఎదలెన్ని
కవి భావన గుర్తించే అభిమానులెంతమంది
కవనమునాస్వాదించే రసపిపాసులెంతమంది

1.చదవడమే గగనమై సాగుతున్న సమయాన
తెలుగు వెలుగు కృష్ణపక్ష మౌతున్న చందాన
వార్తలు వ్యాసాలే పఠనీయత ఉన్నవేళ
సిసలైన కవిత్వమే  నిరాదరణ పాలా

2.సాహిత్యపు పేజీలే అంతంత మాత్రము
ప్రాధేయత పలుకుబడుల పత్రికా లోకము
అస్మదీయ తస్మదీయ పురస్కార వైభవము
ప్రహసనంగా  మారిన బిరుదుల ప్రదానము

No comments: