Sunday, August 30, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

నీదీ నాదీ ఒక ప్రేమకథ
కంచికి చేరని మధుర వ్యథ
ఎలా మొదలయ్యిందో
ఏ మలుపులు తిరిగిందో
వాస్తవంలో  గాయాలెన్నో
నవనీతాల స్మృతులెన్నో
మదిని కాస్త మెలిపెడతూ
సుధను చిలికి ఊరడిస్తూ

1.నరకమూ నాకమూ నీ ప్రతి జ్ఞాపకం
శూన్యమై పోయిందే నీ జతలేక నాలోకం
నీ ఊహలు ఊపిరిగా నీ తలపులు ప్రాణంగా
బ్రతుకునీడుస్తున్నా జీవశ్చవంగా
ఎదురైన ప్రతిసారి నా ఎదకు ఛిద్రం
నా సంగతి వదిలెయ్యి నువ్ మాత్ర భద్రం

2.నీ నిస్సహాయత దీనంగా చూస్తోంది
నా అసహాయత శాపమై కోస్తోంది
గోదారి ఇసుక తిన్నెలు కనుమరుగైనాయి
వెన్నెల రాత్రులన్ని అమావాస్యలైనాయి
మరణం కోసమే నా ఈ నిరీక్షణ
మరుజన్మకైనా తీరనీ వేదన

No comments: