Wednesday, December 23, 2020

 "సింగరేణి" శత వార్షికోత్సవ సందర్భంగా-


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:కీరవాణి


మా తెలంగాణ ఇంధనమా

సింగరేణి కృష్ణ కాంచనమా

శ్రమైక సౌందర్య జీవనమా

జోహారులమ్మా మా వందనం గొనుమా


1.బాసర పునాదిగా భద్రాద్రి తుదిగా

గోదావరి నదీ లోయ ప్రాతిపదికగా

విస్తరించినావమ్మా మా ఆర్తిని తీర్చగా

తరగని బొగ్గుగనిగ  కీర్తిని చేకూర్చగా

జోహారులమ్మా మా వందనం గొనుమా


2.పరిశ్రమల మనుగడకే ప్రాణవాయువై

విశేషించి విద్యుత్తు ఉత్పాదక మూలమై

ప్రభుత ఖజానాకు నీవు సదా చేయూతవై

ప్రజల ఉపాధికల్పనలో ప్రధాన భూమికవై

జోహారులమ్మా మా వందనం గొనుమా


3.శ్రమజీవుల ఘర్మజలం  నిన్నభిషేకించగా

అనవరతం అలుపెరగని కన్నులు హారతిగా

సింగరేణి కార్మిక జీవితకాలమే నైవేద్యంగా

నీదైన ప్రత్యేక లోకమే జనులకు హృద్యంగా

జోహారులమ్మా మా వందనం గొనుమా

No comments: