Wednesday, December 23, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:కురంజి


సద్గురుడవు నీవు కదా సాయి

అందుకో ఇకనైనా ఈ శిశ్యుడి చేయి

వెతుకుతూ వస్తాడట గురువు శిశ్యుడిని

తాత్సారమెందుకు నను ఉద్ధరించడానికి

సచ్చిదానంద సద్గురు సాయినాథా

వందనం యోగిమహారాజా అనాథ నాథా


1.అన్నీ తెలుసుననే అజ్ఞానిని

ఏమీ తెలియని మూఢుడిని

దారీతెన్ను లేక తిరుగుతున్నా

సన్మార్గము చూపమని వేడుతున్నా

సచ్చిదానంద సద్గురు సాయినాథా

వందనం యోగిమహారాజా అనాథ నాథా


2. నా పుట్టుక ప్రయోజనం ఎరుగను

నా జన్మకు పరమార్థం గ్రహించను

కాలయాపనే చేసా ఈనాటి వరకు

తపించిపోతున్నా నీ పాద సేవకొరకు

సచ్చిదానంద సద్గురు సాయినాథా

వందనం యోగిమహారాజా అనాథ నాథా

No comments: