Thursday, April 22, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాధ బాధనెరిగితిని

ఆ బాధనే నే మరిగితిని

శ్యామసుందరుని సన్నధికఱుగని

నందనందనుని కౌగిట కరుగని

బ్రతుకే శూన్యమనీ కడు దైన్యమని


1.అందింతును నాడెందము నవనీతముగా

నివేదింతును నా సర్వము  కృష్ణార్పణముగా

నా పెదవులనే మురళిగ వాయించుమనెద

నా మేని మెరుపులు పింఛముగా తలదాల్చమనెద

ప్రార్థించెదన నే పదదాసిగ అర్థించెద నే ఆశగ


2.బాలకృష్ణుని పాలుచేసెద నాక్షీరభాండాలను

మోహనకృష్ణుని పడక చేసెద నా దేహభాగాలను

రతికేళి సలుపగ సతతము నా మతిలోను

సద్గతులేవొ చేరెద సత్యము శివము సుందర స్థితిలోను

ధ్యానించెద లయమై తన్మయమై ఆనంద నిలయమై

No comments: