రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
నందనవని నీ మానసం -నిన్న ఎంత సుందరం
సుడిగాలి చెలరేగి-నేడు చిందరవందరం
వివిధ వర్ణ విరి శోభితం-నీమది ప్రశాంతమౌ వసంతం
భీభత్సపు వానలు ముంచగ-మోడుబారి ఇపుడో శిశిరం
1.పలుకులు తలపించె నాడు-మెలికలతొ పారే సెలయేళ్ళు
నవ్వుల్ని రువ్వితె చాలు-ఎదలొ దుముకు జలపాతాలు
నీ మౌనమిపుడాయే గాంభీర్య గౌతమి
నీ హృదయమనిపించే అగాధాల జలధి
2.నీ కనులు కురిపించేను పగలైనా వెన్నెలలు
నీ చెలిమి అలరించేను తొలగించ వేదనలు
మూగవోయింది వీణ తీగలే తెగిపోయి
రాగాలు మరిచింది నలుగురిపై గురిపోయి
No comments:
Post a Comment