https://youtu.be/IHTUd6GLEXk?si=4nLpCUbokKYLlnFT
రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)
రాగం:పీలూ
ఎంతగా నేనెదురుచూచితినో
ఎనుబదినాలుగు లక్షల జన్మలెత్తి
ఎంతగా నే వగచియుంటినో
పదేపదే పదేపదే ఇట పుట్టి చచ్చి
తుదకు దొరికె స్వామి ఈ దుర్లభనరజన్మ
వదులుకోనీ తడవ కాదనక నను చేకొమ్మా
1.విజ్ఞత విచక్షణ ఎరగని అజ్ఞానినైతి
ఆహార నిద్రా భయ మైథునాలే నాకు స్మృతి
ఎన్నాళ్ళీ పంకిల వలయమౌ పుట్టుక మిత్తి
కణ కీటక మత్స్య పక్షి మృగ జీవాకృతి
తుదకు దొరికె స్వామి ఈ దుర్లభనరజన్మ
వదులుకోనీ తడవ కాదనక నను చేకొమ్మా
2.నిన్నటిదాకా నే పశువునే మనిషి రూపునా
వచ్చిన పని మరచి తుఛ్ఛవాంఛల ప్రాపునా
ఏ ఒక్కటి చేసితినో సత్కర్మ నీ ప్రేమ వశాన
అవగతమాయెనా జీవితపరమార్థమీ క్షణాన
శరణాగతినీవే నను నీలో కలుపుకో గణనాథా
వదులుకోను ఈ తడవ కాదనక నను చేకొమ్మా
No comments:
Post a Comment