Monday, November 28, 2022

 https://youtu.be/C12ZhlMd9_0?si=8l8n3svtM32hQJcX


1)గోదాదేవి తొలిపాశురగీతం-స్వేచ్ఛానువాదం

30రోజుల వ్రతం-ముప్పై రాగాలతో గీతా ఆరాధన


దయచేసి ఇవే రాగాలలో పాడాలని విన్నపము

ఇవి ఆ మురళీ మోహనుడు పలికించిన రాగాలు


రచన:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం:దర్బార్ కానడ


గొల్లభామలారా-రేపల్లె లేమలారా

మార్గశిర మాసమెంతొ మేలైనది

మన నందబాలునర్చించే వేళైనది

మార్గళి స్నానముకై  చనుచుంటినే నది

చెలులార ఆలకించరో మేలుకొనగ గోదా పిలుపిది


1.ఘనశ్యామ సుందరుడు నంద కిశోరుడు

డెందాలను మురిపించే బృందావిహారుడు

రవి తీక్షణుడు శశి వీక్షణుడు సర్వసులక్షణుడు

అన్యధా శరణం నాస్తి మనకు శ్రీమన్నారాయణుడు

అనవరతము తపించ శ్రీ వ్రతఫలమీయును కృష్ణుడు


2.వలువలు దాచేసే నవనీతచోరుడు

వదులుకొనే తెగువుంటే మదినే దోచువాడు

ఆనందవర్దనుడు అహంకార మర్దనుడు

జగన్మోహనాకారుడు జగదుద్ధారుడు జనార్ధనుడు

అనవరతము తపించ శ్రీ వ్రతఫలమీయును కృష్ణుడు

No comments: