Monday, November 28, 2022

 

https://youtu.be/C12ZhlMd9_0?si=8l8n3svtM32hQJcX

(2)గోదాదేవి రెండవ పాశురగీతం-స్వేచ్ఛానువాదం

30రోజుల వ్రతం-ముప్పై రాగాలతో గీతా ఆరాధన


దయచేసి ఇవే రాగాలలో పాడాలని విన్నపము

ఇవి ఆ మురళీ మోహనుడు పలికించిన రాగాలు


రచన:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం:నీలాంబరి

(రాగ ఆధారం జంటిల్ మెన్ సినిమా పాట- నా ఇంటి ముందున్న పూదోటనడిగేనూ)


ధనుర్మాస శుభవేళ తిరుప్పావై వ్రతదీక్ష

నీమాల నాచరించ నిక్కము ఒక పరీక్ష

పురుషోత్తమ మాధవా పుండరీకాక్ష

శరణంటిమి పరిసమాప్తి చేయగ మాకీవె రక్ష


1. చేసెదము మబ్బుననే కావేటి స్నానము

సతతమూ  రంగనాథ మదిలో నీ ధ్యానము

పలికెదము గోవిందా మా నోట నీ నామము

ఆచరించెదము ఆర్తిమీర మార్గళి సిరినోము


2.కంటికి నిను అంటించి-కృష్ణా కాటుక మానేము

కమలాక్షుడ తలనిడి నిను- పూలకొప్పు ముడువము

నెయ్యిని పాలను నీనెయ్యముకై మేమారగించము

ప్రియమగు సత్యమగు నుడుగులనే నుడివెదము


3.పాలకడలి శయనించే పద్మనాభ మంగళము

విబుధవరేణ్యుల కొసగెదము విరళ దానము

సాధు సంతులకు బ్రహ్మచారులకు నిత్య సమారాధనము

క్రమతను మము నడుపగ స్వామీ నీకు వందనము

No comments: