Tuesday, December 13, 2022

 https://youtu.be/_6zJtODPjxI?si=ILLI0B6SYd6Xhgvv


18) గోదాదేవి పదునెనిమిదవ పాశురగీతం-స్వేచ్ఛానువాదం

30 రోజుల వ్రతం-ముప్పై రాగాలతో గీతా ఆరాధనం

దయచేసి ఇవే రాగాలలో పాడాలని విన్నపము

ఇవి ఆ మురళీ మోహనుడు పలికించిన రాగాలు


రచన:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం:శ్యామ 


నీలిమేఘశ్యాముని కృష్ణుని నీ నాథునిగాగొని

నందగోపరాయుని ముద్దుల కోడలైన భామిని

నీలాసుందరి దేవీ నిదురలెమ్ము సతీశిరోమణి

ఫలింపజేయి శ్రీనోము నోచెటి మా మనోకామనని


1.పరిమళాలలు వెదజల్లే  నీలి కురుల ఓ రమణి

తొలికోడి కూస్తోంది తలుపు తెరువు శుభ తరుణి

పికమాలపిస్తోంది గురువిందతీగ పందిరిపై కూర్చొని

గడియతీయి  పూమంజరి గొనినచేత ఓ గజగామిని


2.కెందామరలైతోచు నీ సుందరమగు చేతులు

కదలమెదల పలుకును నీగాజులు సంగీతసంగతులు

గోవిందుని గుణగణాలు కీర్తించును మా గీతులు

తొందరించి నిదురలేచి తీయవమ్మ గది తలుపులు

No comments: