Monday, December 19, 2022

 

https://youtu.be/CM-0jPiyKcE?si=ZDvNbWdVTtSIFzes

24) గోదాదేవి ఇరవై నాలుగవ పాశురగీతం-స్వేచ్ఛానువాదం

30 రోజుల వ్రతం-ముప్పై రాగాలతో గీతా ఆరాధనం

దయచేసి ఇవే రాగాలలో పాడాలని విన్నపము

ఇవి ఆ మురళీ మోహనుడు పలికించిన రాగాలు


రచన:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం:బృందావన సారంగ


మూడు అడుగులతోటి ముల్లోకములు గొలిచి

కీర్తినొందిన శ్రీ కృష్ణమూర్తీ 

నీ పాదపద్మాలకు ఇదే శుభ మంగళం

ఆజానుబాహులతో శరపరంపర వైచి

లంకేశు కూల్చిన కోదండ పాణీ

నీ బలమైన కరములకు జయ మంగళం


1.చిననాటనే అకటా !శకటాసురుని ద్రుంచి

వాసికెక్కిన వాసుదేవా నీకు సుమ మంగళం

వృత్తాసురుని వడిసెల రాయిగా విసిరిన హరీ

వీరగాథతో అబ్బురపరచిన నీకు కర్పూర మంగళం


2.గోటితో గోవర్ధన గిరినెత్తి గోకులాన్ని కాచినా

గోపాలకృష్ణా నీ అపార కృపకిదే భవ్య మంగళం

కపిత్థాసురాది శత్రువులను వధియించిన

సుదర్శన చక్రధారీ నీ శౌర్యానికిదె దివ్య మంగళం


3.జయమంగళం నిత్య శుభమంగళంబనుచు

నీ లీలలు మహిమల గుణ గానమే మావ్రతం

ఇహపరములందును పరమార్థమొందుచును

తరియించగా సిద్ధింపజేయుమా మా నోము ఫలితం

No comments: