https://youtu.be/EO4VgWAKFS8?si=mwlo1Ts9i2pPYx-3
23) గోదాదేవి ఇరవై మూడవ పాశురగీతం-స్వేచ్ఛానువాదం
30 రోజుల వ్రతం-ముప్పై రాగాలతో గీతా ఆరాధనం
దయచేసి ఇవే రాగాలలో పాడాలని విన్నపము
ఇవి ఆ మురళీ మోహనుడు పలికించిన రాగాలు
రచన:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)
రాగం:సింహేంద్ర మధ్యమం
దయచేయవయ్యా నవనీత హృదయా మాపై
దయచేయగ నీతలపులు మదిలో పొద్దూమాపై
వానకారున కుహరాన నిదుర చెదిరిన హరి రూపై
ఒళ్ళు సాగదీసి జూలును విదిలించి గర్జించిన సొంపై
నల్లనయ్యా నీ కృపతో వ్రత ఫలితము దక్కు మా మదికింపై
1.సర్వాలంకార శోభితుడవై సభ కరుదెంచి
రత్నఖచితమౌ సింహాసనమును అధిష్ఠించి
విన్నపాలనాలకించి ఆపన్నుల అనుగ్రహించి
పరిపాలించెదవు నిఖిల జగతికి శుభములు కూర్చి
నల్లనయ్యా నీ కృపతో సత్ఫలితమునందేము వ్రతమాచరించి
2. నందకిషోర సందడిజేయగ వేంచేయరా
యదుకుల వీర గోవర్ధన గిరిధరా బలరామ సోదరా
పీతాంబరధారి వైజయంతి వనమాలి జగదీశ్వరా
కస్తూరితిలకాంకిత కౌస్తుభాలంకృత మరళీధరా
నల్లనయ్యా నీ కృపతో సత్ఫలితమునందేము వ్రతమాచరించనీయరా
No comments:
Post a Comment