https://youtu.be/pJeoIwrJ8PI?si=Qe3P0C1fuGRMeyw3
27) గోదాదేవి ఇరవై ఏడవ పాశురగీతం-స్వేచ్ఛానువాదం
30 రోజుల వ్రతం-ముప్పై రాగాలతో గీతా ఆరాధనం
దయచేసి ఇవే రాగాలలో పాడాలని విన్నపము
ఇవి ఆ మురళీ మోహనుడు పలికించిన రాగాలు
రచన:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)
రాగం:హిందోళం
వాంఛితార్థ దాయకా-యదుకుల దీపకా
మాధవా కేశవా గోవిందా మనసిజ జనకా
కరివరదా వరములీయి కనికరముతొ మాకికా
వ్రత ఫలమును అందీయవొ జాగు సేయకా
1.సామగ్రీయుటె కాదు స్వామి తీర్చాలి మా కోరిక
లోకులంత చకితులై చూడగ మానోము వేడుక
రవ్వల గాజులు మువ్వల పట్టీలు చెవికమ్మలు
కంకణాలు కేణీలు మాకొసగుము పసిడి నగలు
2.పట్టుచీరలేకట్టి నగలన్ని మా మేన దిగబెట్టి
పరమాన్నము వండి పెట్టి నీకు నైవేద్యమెట్టి
జుర్రాలి పాయసాన్ని కమ్మని నేయిని కలిపిపెట్టి
ప్రసాదించు ఈ రీతి నోముఫలము జగజ్జెట్టీ
No comments:
Post a Comment