https://youtu.be/x-s9SF70vbs?si=5FqyMjNvqoLoKzW3
26) గోదాదేవి ఇరవై ఆరవ పాశురగీతం-స్వేచ్ఛానువాదం
30 రోజుల వ్రతం-ముప్పై రాగాలతో గీతా ఆరాధనం
దయచేసి ఇవే రాగాలలో పాడాలని విన్నపము
ఇవి ఆ మురళీ మోహనుడు పలికించిన రాగాలు
రచన:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)
రాగం:అమృత వర్షిణి
నిమిత్తమాత్రులమే మేము శ్యామసుందరా
నీ ప్రేమ పాత్రులమే ప్రభూ ప్రేమ మందిరా
కర్తా కర్మ క్రియా సర్వం నీవే ఆశ్రిత వరదా మాధవా
మనసా వాచా కర్మణా నిను నమ్మితిమి ఆపద్బాంధవా
1.వ్రతాచరణలో అర్చనకై వలయు సరంజామా
అమర్చవయ్యా తగువిధి నీ కరుణే మాకు ధీమా
శంఖము ఢంకా గంటలు తప్పెట తాళవాద్యాలు
మంగళ మాణిక్యాలు ధ్వజారోహణకై పతాకాలు
2.మంగళా శాసన పరులు ఆచార్య భూసురులు
నీ ధ్యానమగ్నులు నిత్యాగ్నిహోత్రులు యాజ్ఞికులు
నిష్ఠతో చేసేము కృష్ణా తిరుప్పావై వ్రతాచరణ రీతులు
సిద్ధింపజేయవయ్యా దయతో నీవు వ్రత ఫలశ్రుతులు
No comments:
Post a Comment