Tuesday, December 20, 2022

 

https://youtu.be/aD7a9UPeZjM?si=a7bXqvKvSysB7gnM

28) గోదాదేవి ఇరవై ఎనిమిదవ పాశురగీతం-స్వేచ్ఛానువాదం

30 రోజుల వ్రతం-ముప్పై రాగాలతో గీతా ఆరాధనం

దయచేసి ఇవే రాగాలలో పాడాలని విన్నపము

ఇవి ఆ మురళీ మోహనుడు పలికించిన రాగాలు


రచన:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం:కళ్యాణి


దయనే కురిసేటి కన్నులతోటి మము కన్నయ్యా

గోకులమంతా మురిసేటి వెన్నలాంటి మనసున్నయ్యా

నందకిషోరా నవనీతచోరా రేపల్లె అల్లరి నల్లనయ్యీ

గొల్లభామల ఉల్లములే కొల్లగొట్టిన కొంటె కిట్టయ్యా

నీ చెలులము నిను చనువుగా ముద్దుపేర్ల పిలిచేము

అలుగక చెలఁగక అడిగినవొసగి నెరవేర్చు మా నోము


1.పశువుల కాపరులము ఐనా నీకు కాముపరులము

అన్నెం పున్నెం ఎరుగని అన్నుల మిన్నలం గోపకన్నెలం

అమాయకపు భామలం మోహన కృష్ణా నీ మాయకు అధీనులం

త్రికరణ శుద్ధిగా ప్రభూ నిన్ను మాత్రమే నమ్ముకున్న దీనులం


2.నీ పదధూళితో పునీతమైంది మా గోకులమంతా

ఏ సంచిత కర్మతోనో గడిచింది బ్రతుకంతా నీ చెంత

ధన్యమాయే మాజన్మ నీవల్ల తొలగేను మా యే చింత

ప్రసాదించు స్వామి పురుషార్థాలను హే అనంతా

No comments: